పెర్త్: ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తోందని మాజీ వెస్టిండీస్ క్రికెటర్ క్లీవ్ లాయిడ్ కితాబిచ్చారు. భారత జట్టు ప్రదర్సన ఆయనను ఆకట్టుకుంది. ధోనీ సేన ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుంటోందని చెప్పాడు. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారన్నాడు. ధోనీ సేన ప్రపంచకప్లో అత్యుత్తమ జట్టు అని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. అన్నింట్లో బ్యాలన్స్గా వెళుతోందన్నాడు.
రవిచంద్రన్ అశ్విన్ బౌలింగుతో ఆకట్టుకుంటున్నాడని చెప్పాడు. భారత్ మిడిల్ ఆర్డర్ బాగుందని చెప్పాడు. కోహ్లీ అద్భుతమని చెప్పాడు. ధోనీ ఏ సమయంలోనైనా ఏమైనా చేయగలడని కితాబిచ్చాడు. వారు తమ లక్ష్యాన్ని సాధిస్తారని భావిస్తున్నానని చెప్పాడు.
ప్రేమ విషయం చెప్పిన ధోనీ
తాను అందరిలా తన భార్య సాక్షికి ప్రపోజ్ చేయలేదని మహేంద్ర సింగ్ ధోనీ ఓ టీవీ కార్యక్రమంలో చెప్పాడు. చిన్న పిల్లల ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ పిల్లాడు ధోనీని తన ప్రేమ గురించి అడిగాడు. సాక్షికి ఎలా ప్రపోజ్ చేశావని ప్రశ్నించాడు.
అతని ప్రశ్నకు నవ్విన ధోనీ.. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా లేక ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. దానికి అతను లేదని చెప్పాడు. ఆ తర్వాత తన ప్రేమ కథను చెప్పాడు. టీమిండియా ఆడుతుండగా.. ఓ స్నేహితురాలి ద్వారా పరిచయమైన సాక్షికి తానే ప్రపోజ్ చేశానని చెప్పాడు. అయితే తాను పెళ్లి చేసుకుంటావా అని అడిగానని చెప్పాడు.
అయితే, సాక్షి తన మాటలను లెక్క చేయలేదని, ఆ తర్వాత తాను నిజంగానే పెళ్లి ప్రస్తావన తెచ్చానని, రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పెళ్లి చేసుకుంటేనే ప్రేమించాలని ధోనీ సూచించాడు.