ముంబై: త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచ కప్కు భారత క్రికెట్ ఆటగాళ్ల భార్యలు, ప్రియురాళ్లను అనుమతించవద్దని బీసీసీఐ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీ నుండి ఆస్ట్రేలియా - న్యూజిలాండ్లలో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో ప్రియురాళ్లను, భార్యలను ఆటగాళ్ల వెంట పంపించే విషయమై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగిన రెండు టెస్టుల అనంతరం బీసీసీఐ భార్యలు, ప్రియురాళ్లను అనుమతించింది.
దీంతో, శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛటెశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ తదితరులు కొత్త ఏడాదిని తమ భార్యలతో కలిసి జరుపుకున్నారు. మిగతా రెండు టెస్టుల సమయంలో వారి భార్యలు ఉన్నారు. అంతేకాదు, విరాట్ కోహ్లీ కూడా తన ప్రియురాలి అనుశ్క శర్మతో కలిసి కనిపించాడు. అయితే, ఇప్పుడు బీసీసీఐ భార్యలు, ప్రియురాళ్లకు ప్రపంచ కప్లో నో చెప్పనుందని తెలుస్తోంది.