కరాచీ: ఈ డిసెంబర్ నెలలో అసలు భారత్ పాకిస్తన్ సిరీస్ ఉందా లేదా తేల్చాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం నాడు బిసిసిఐకి లేఖ రాసింది. ఇందుకు సంబంధించి మీడియాలో వార్తలు వస్తున్నాయి.
యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇండో పాక్ సిరీస్ ఉండే డిసెంబర్ నెలలో గల తేదీలను ఖరారు చేయాలని పిసిబి.. బిసిసిఐని కోరింది. ఈ సిరీస్ ఉందో లేదో స్పష్టం చేయాలని అడిగింది.
పిసిబి ప్రతినిధి షహర్యార్ బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్కు లేఖ రాశారు. డిసెంబర్ నెలలో అసలు సిరీస్కు అవకాశముందా చెప్పాలన్నాడు. రాజకీయాలు, వేరు క్రీడలు వేరు అని లేఖలో పేర్కొన్నాడు.
రాజకీయాల నుంచి క్రీడలుదూరంగా ఉండాలన్నాడు. అదే సమయంలో బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ గురించి కూడా పేర్కొన్నారు.
తాము బ్రాడ్ కాస్టింగ్ హక్కులు టెన్ స్పోర్ట్స్కు ఇచ్చామని, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సదరు ఛానల్ బిడ్ అంగీకరించిందన్నారు. గతంలో ఇదే పిసిబి ప్రతినిధి షహర్యార్.. భారత్ - పాకిస్తాన్ మధ్య సిరీస్ పైన నీలినీడలు కమ్ముకున్నాయని చెప్పాడు.