అలరించిన గుత్తా జ్వాల, పీవీ సింధు పోరు
ఇందులో హైదరాబాద్ అమ్మాయిలు గుత్తా జ్వాల, పీవీ సింధు తలపడి అలరించారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఏసర్స్ జట్టు తరఫున ఆడిన గుత్తా జ్వాల, ఇవనోవ్ జంట, చెన్నై స్మాషర్స్ తరఫున ఆడిన పీవీ సింధు, క్రిస్ అడ్ కాక్ జోడీపై విజయం సాధించింది.
తొలి సెట్ను కైవసం చేసుకున్న సింధు జోడి
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను 7-11 తేడాతో సింధు జోడి కైవసం చేసుకున్నప్పటికీ, ఆపై రెండు సెట్లనూ 11-4, 11-9 తేడాతో జ్వాల, ఇవనోవ్ జోడి గెలిచింది. ఈ గెలుపుతో పాటు మరో రెండు మ్యాచ్లలో సైతం ఢిల్లీ నెగ్గడంతో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.
సన్ వాన్ హొ చేతిలో ఓటమిపాలైన కశ్యప్
ఆ తర్వాత కశ్యప్ 10-12, 4-11తో సన్ వాన్ హొ (ఢిల్లీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో ఢిల్లీ ఆధిక్యం 3-0కు పెరిగింది. ఇక ట్రంప్గా ఎంచుకున్న పురుషుల డబుల్స్లోనూ ఢిల్లీ ఏసర్స్ జోరు ప్రదర్శించి విజయాన్ని ఖాయం చేసుకుంది. వ్లాదిమిర్ ఇవనోవ్-ఇవాన్ సొజొనోవ్ జోడీ 11-6, 11-6తో స్మాషర్స్ ద్వయం అడ్కాక్-కోల్డింగ్పై అలవోకగా నెగ్గింది.
తన్వీ లాడ్పై సింధు విజయం
దీంతో ఢిల్లీ 5-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ (చెన్నైకి ట్రంప్)లో సింధు 11-6, 11-7తో తన్వీ లాడ్పై విజయం సాధించింది. తన్వీ లాడ్తో మ్యాచ్లో సింధు 11-6, 11-7తో సునాయాస విజయం సాధించింది.