హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది. గురువారం బెంగాల్ వారియర్స్తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ 26-26 స్కోరుతో గుజరాత్ జెయింట్స్ డ్రాగా ముగించింది.
ఈ మ్యాచ్లో గుజరాత్ 20 రైడింగ్, 3 ట్యాకిల్, 2 ఆలౌట్, 1 ఎక్స్ట్రా పాయింట్ సాధించగా, బెంగాల్ వారియర్స్ 17 రైడింగ్, 5 ట్యాకిల్, 2 ఆలౌట్, 2 ఎక్స్ట్రా పాయింట్లు సాధించింది. గుజరాత్ రైడర్లు సచిన్ 8, సుకేశ్ 6 పాయింట్లతో రాణించారు.
ఇక, బెంగాల్ వారియర్స్ జట్టులో దీపక్ నర్వాల్ 9, మణీందర్ సింగ్ 4, జాంగ్ కున్ లీ 3 పాయింట్లు సాధించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చివరి రైడ్లో పాయింట్ తెచ్చుకున్న బెంగాల్ జట్టు ఓటమి నుంచి తప్పించుకుంది.
ప్రో కబడ్డీలో శుక్రవారం జరిగే మ్యాచ్లు:
యూపీ యోధ × యూ ముంబా రాత్రి 8 గంటలకు
బెంగళూరు బుల్స్ × జైపూర్ పింక్ పాంథర్స్ రాత్రి 9 గంటలకు
వేదిక: లక్నో
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ 2