హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్పై బెంగళూరు బుల్స్ విజయం సాధించింది. బుధవారం జరిగిన జోన్ 'బి' మ్యాచ్లో బెంగళూరు 31-25తో వారియర్స్పై గెలిచింది. ఈ లీగ్లో బుల్స్కు ఇది మూడో విజయం కాగా బెంగాల్కు తొలి ఓటమి.
బెంగళూరు రైడర్ ఈ మ్యాచ్లో అజయ్ కుమార్ అద్భుత ప్రదర్శన చేశాడు. 19 సార్లు రైడింగ్కు వెళ్లిన అజయ్ 8 పాయింట్లు తెచ్చాడు. తోలి అర్ధభాగంలో 12-10తో స్వల్ప ఆధిక్యం సాధించిన బెంగాల్ వారియర్స్ రెండో అర్ధంలో స్పష్టమైన పైచేయి సాధించింది. రెండో అర్ధభాగంలో రెండు జట్లు దూకుడుగా ఆడాయి.
16-16తో స్కోరు సమమైన దశలో బెంగళూరు దూకుడుగా ఆడి 24-18తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. డిఫెండర్ ఆశిష్ కుమార్ (5) టాకిల్లో అదరగొట్టాడు. టాకిల్ చేసిన ఐదు సార్లు పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో రోహిత్ కుమార్ 6, రవీందర్ పాహల్, మహేందర్ సింగ్ చెరో 2 పాయింట్లు సాధించారు.
రైడ్ పాయింట్లలో బెంగాల్ 15-14తో ఆధిక్యం సాధించినప్పటికీ... ట్యాకిల్లో బెంగళూరు 12-8తో పైచేయి సాధించింది. అంతేకాదు బెంగళూరు అదనంగా మరో 3 పాయింట్లు కూడా లభించాయి. అజయ్ కుమార్ 8 రైడ్ పాయింట్లతో, ఆశిష్ కుమార్ 5 ట్యాకిల్ పాయింట్లతో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక బెంగాల్ వారియర్స్ జట్టులో జాంగ్ కున్ లీ 15 సార్లు రైడింగ్కు వెళ్లి 8 పాయింట్లు సాధించగా... టాకిల్లో సుర్జీత్ సింగ్ (4) ఆకట్టుకున్నాడు. ఇరు జట్లు ఒక్కోసారి ఆలౌటయ్యాయి. ఇక గురువారం పుణేరి పల్టన్తో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. ఈ మ్యాచ్లను 'స్టార్ స్పోర్ట్స్-2' చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
Rohit & Ajay Kumar were fully charged as @BengaluruBulls beat @BengalWarriors in tonight's #LePanga! #BLRvBEN #VivoProKabaddi pic.twitter.com/NRSm0B9QMs
— ProKabaddi (@ProKabaddi) 9 August 2017
.@BengaluruBulls thwarted an in-form @BengalWarriors side, riding high on Ajay Kumar's ⚡️ showing! Here are some moments from #BLRvBEN! pic.twitter.com/bYSs5RKabv
— ProKabaddi (@ProKabaddi) 9 August 2017