6 పాయింట్లు రాబట్టిన సింధు
ఒకానొక దశలో 9-20తో ఉన్నారు. ఈ క్రమంలో సింధు వరుసగా 6 పాయింట్లు రాబట్టింది. దీంతో 15-21తో తొలి గేమ్ను కోల్పోయింది. ఇక రెండో గేమ్లో సింధు తేరుకొని 15-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో సున్ యు దూకుడుగా ఆడి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17-15తో ముందంజ వేసింది.
ఔట్షాట్లతో సింధు అనవసర తప్పిదాలు
రెండో గేమ్లో ఔట్షాట్లతో అనేకసార్లు తప్పిదాలకు పాల్పడిన సింధు ఆ తర్వాత గేమ్పై ఏకాగ్రత కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది. ఈ ఓటమితో సింధు సెమీఫైనల్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇక తన గ్రూప్ లీగ్ దశలో ఆఖరిదైన మూడోమ్యాచ్లో సింధు మాజీ ప్రపంచ నంబర్వన్ కరోలినా మారిన్తో శుక్రవారం తలపడనుంది.
కరోలినా మారిన్తో సింధు
ప్రపంచ రెండోర్యాంకర్ అయిన స్పెయిన్ స్టార్ కరోలినా ఈ ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో సింధును ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మారిన్తో ముఖాముఖి రికార్డులో సింధు 2-5తో వెనుకంజలో ఉంది. ఇక మరో మ్యాచ్లో జపాన్ స్టార్ యమగుచి 18-21, 21-17, 21-14తో మారిన్ను చిత్తుచేసింది.
కీలకంగా మారిన నేటి మ్యాచ్
గ్రూప్-బిలో వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించిన సన్ యూ దాదాపుగా సెమీఫైనల్కు చేరినట్లే. ఇక ఈ గ్రూప్ నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం కరోలినా మారిన్, యమగుచి, సింధుల మధ్య పోటీ నెలకొంది. ఈ ముగ్గురిలో సింధు, యమగుచి తామాడిన రెండుమ్యాచుల్లో ఒక్కో విజయం సాధించి సమంగా ఉన్నారు. ఇక మారిన్ మాత్రం రెండుమ్యాచుల్లో ఓటమిపాలైంది. దీంతో శుక్రవారం జరిగే మ్యాచ్ సింధుకు ఎంతో కీలకంగా మారింది. సింధు మ్యాచ్ని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రత్యక్షంగా వీక్షించాడు.