హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ నుంచి చివరి నిమిషంలో తప్పుకుంది. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఈ టోర్నీలో గత మూడేళ్లుగా సింధు విజేతగా నిలిచింది. గత వారంలో చైనా ఓపెన్ సిరిస్ టైటిల్ను చేజిక్కించుకుని, హాంకాంగ్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన మకావు ఓపెన్కు దూరమవ్వడానికి కారణం ఉంది.
డిసెంబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్కు అర్హత సాధించిన నేపథ్యంలో మరింత ప్రాక్టీస్ కోసం సింధు తప్పుకుంది. మకావు ఓపెన్ నుంచి సింధు తప్పుకోవడంతో మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ టైటిల్పై కన్నేసింది. మోకాలి శస్త్రచికిత్స తర్వాత సైనా ఆడిన చైనా ఓపెన్, హాంకాంగ్ ఓపెన్లలో నిరాశ పర్చిన సంగతి తెలిసిందే.
Macau open 😊😊😊@NHarvir @parupallik .......2016 pic.twitter.com/3xvm14UavW
— Saina Nehwal (@NSaina) November 28, 2016
దీంతో మకావు ఓపెన్ టైటిల్ను సాధించాలనే పట్టుదలతో సైనా ఉంది. మహిళల సింగిల్స్లో భాగంగా సైనా తొలి రౌండ్లో హన్నా రమదిని (ఇండోనేసియా)తో తలపడుతుంది. కాగా, పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ కిడాంబి శ్రీకాంతకు తొలి రౌండ్లో బై లభించింది.
హాంకాంగ్ ఓపెన్లో ఫైనల్ చేరి వెలుగులోకి వచ్చిన సమీర్ వర్మ కూడా మకావు ఓపెన్లో పోటీ పడుతున్నాడు. తొలి రౌండ్లో లామ్ హిమ్ (మకావు)తో సాయిప్రణీత్, జెంగ్ సిన్ (మలేసియా)తో కశ్యప్, చున్ చెన్ (చైనీస్ తైపీ)తో ప్రణయ్, మిలాన్ లుడిక్ (చెక్ రిపబ్లిక్)తో సమీర్వర్మ తలపడతారు.
ఇక మహిళల మిక్స్డ్ డబుల్స్లో గుత్తా జ్వాల-మను అత్రి జోడీ బరిలోకి దిగనుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో చాన్ లుంగ్- క్యున్ హాన్ (హాంకాంగ్)తో సుమీత్రెడ్డి- మను అత్రి పోటీపడతారు.