14 పాయింట్లతో నాకౌట్కు అర్హత
తద్వారా లీగ్ దశలో స్మాషర్స్ 14 పాయింట్లతో నాకౌట్కు అర్హత సాధించింది. తొలి పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ 9-11, 11-13తో ప్రణయ్ చేతిలో ఓడటంతో ముంబై 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత మిక్స్డ్ ట్రంప్ మ్యాచ్లో క్రిస్ అడ్కాక్-గాబ్రియెల్ అడ్కాక్ జోడీ విజయం సాధించడంతో చెన్నై 2-1తో ముందంజ వేసింది.
పురుషుల సింగిల్స్లో టామీ సుగియార్టో విజయం
ఇక రెండో పురుషుల సింగిల్స్లో టామీ సుగియార్టో 8-11, 11-2, 11-5తో అజయ్ జయరామ్పై గెలవడంతో చెన్నై 3-1తో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి గేమ్ ఓడిన సుగియార్టో తర్వాత అద్భుత ప్రదర్శనతో రెండో గేమ్ నెగ్గి మ్యాచ్లో నిలిచాడు. ఇక నిర్ణాయక మూడో గేమ్లో టామీకి ఎదురులేకుండా పోయింది.
వరుస గేముల్లో సంగ్ జి హ్యున్ను ఓడించిన సింధు
ఇక ఆ తర్వాతి మ్యాచ్లో పీవీ సింధు 11-8, 12-10తో వరుస గేముల్లో సంగ్ జి హ్యున్ను ఓడించడంతో చెన్నై 4-1తో గెలుపు ఖాయం చేసుకుంది. ఇక ముంబై ట్రంప్ మ్యాచ్గా ఎంచుకున్న పురుషుల డబుల్స్లో లీ యంగ్ డయె-పువాంగ్పుపెట్ జోడీ 11-3, 11-5తో క్రిస్ అడ్కాక్-కోల్డింగ్ జోడీ నెగ్గినా ప్రయోజనం లేకపోయింది.
ముంబై, అవధ్ వారియర్స్తో పాటు సెమీస్కు చెన్నై
చివరకు చెన్నై స్మాషర్స్ 4-3తో మ్యాచ్ను ముగించింది. కాగా, ఇప్పటికే ఈ లీగ్లో ముంబైతో పాటు సైనా నెహ్వాల్ నేతృత్వంలోని అవధ్ వారియర్స్ సెమీ ఫైనల్స్కు అర్హత సాధించాయి. దీంతో మిగిలిన బెర్త్ కోసం బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య పోటీ నెలకొంది.