ఫతుల్లా: బంగ్లాదేశ్తో బుధవారం ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్లో ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్లు రికార్డులు సృష్టించారు. ఫతుల్లాలోని ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా దూకుడుగా ఆడుతున్న సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో మూడు గంటల సేపు ఆట ఆగిపోయింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్లు శిఖర్ ధావన్ 150, మురళీ విజయ్ 89 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలిరోజు నెలకొల్పిన రికార్డులు, గణాంకాలు:
* వికెట్ నష్టపోకుండా 239 పరుగుల భాగస్వామ్యం. బంగ్లాదేశ్పై టెస్టుల్లో టీమిండియా ఓపెనర్లు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. (2004లో రాహుల్ ద్రవిడ్, గంభీర్లు - 259)
* 4 - భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్టుల్లో నాల్గవ డబుల్ సెంచరీ.
* ఓపెనర్ శిఖర్ ధావన్ 150 నాటౌట్ - బంగ్లాదేశ్ Vs భారత్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ల్లో ఐదవ అత్యధిక వ్యక్తిగత స్కోరు. (2004లో సచిన్ అత్యధికం - 248).
* టెస్టుల్లో ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ల మధ్య రెండవ డబుల్ సెంచరీ భాగస్వామ్యం.
* శిఖర్ ధావన్కు టెస్టులో ఇది మూడవ సెంచరీ. 150కు పైగా పరుగులు సాధించడం రెండోసారి. 2013లో ఆస్టేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు 187ను నమోదు చేశారు.
* 1,000 పరుగులు - టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్లు 1,000కి పైగా పరుగులు చేసిన ఆరవ జోడీ.