బ్రెజిల్: రియో ఒలింపిక్స్ 2016 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆటగాళ్లు బ్రెజిల్ వస్తున్నారు. ఈ ఒలింపిక్స్ ఆగస్టు 5వ తేదీన అధికారికంగా ప్రారంభం కానుంది. ఓపెనింగ్ సెరామనీ అదిరిపోనుంది. బ్రెజిల్ తొలిసారి ఒలింపిక్స్ నిర్వహిస్తోంది.
డోపింగ్, అథ్లెట్ గ్రామాల్లో జికా వైరస్.. తదితర ఇష్యూల మధ్యనే ఆటగాళ్లకు ఒలింపిక్స్ ఆహ్వానం పలుకుతోంది. పదివేల మందికి పైగా ఆటగాళ్లు ఒలింపిక్స్లో పాల్గొంటారు. 19 రోజులు జరగనున్నాయి. భారత్ తొలిసారి 119 మందితో పెద్ద జట్టును పంపిస్తోంది.
ఓపెనింగ్ సెరామనీ ఎప్పుడు?
ఒలింపిక్స్ వేడుకలు అధికారికంగా ఆగస్టు 5వ తేదీన ప్రారంభం కానున్నాయి. రియో డీ జెనీరోలోని మరకన స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ స్టేడియంలో 78,000 మంది పడతారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం నాడు రాత్రి 8 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలో... భారత్లో ఆగస్టు 6 (శనివారం) వేకువ జామున 4.30గంటలు.
టెలికాస్ట్
స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఓపెనింగ్ సెరామనీని టెలికాస్ట్ చేయనుంది. స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3, 4లతో పాటు హై డెఫినిషన్ చానల్స్ ప్రసారం చేస్తాయి. ఈ ఛానల్స్ ఓపెనింగ్ సెరామనీతో పాటు ఆటలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులు దక్కించుకున్నాయి. హిందీ, ఇంగ్లీష్లలో కామెంటరీ వస్తుంది.
ఒలింపిక్ జ్యోతి వెలిగించేది ఎవరంటే..
బ్రెజిల్ లెజెండ్, మాజీ ఫుట్పాల్ ఆటగాడు పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నాడు. అంతేకాదు, అతను ఒలింపిక్స్ కోసం 'ఎస్పెరాంకా' అనే పాటను కంపోస్ చేశాడు. సమాచారం మేరకు బ్రెజిల్ సూపర్ మోడల్ జిసెల్ కూడా ఓపెనింగ్ సెరామనీలో పాల్గొనున్నారు.
I am proud to present my new song "Esperança" dedicated to my country, Brazil. Enjoy! https://t.co/nvngJhMl0f pic.twitter.com/356Fzrh0Am
— Pelé (@Pele) July 18, 2016