రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో పరుగుల మిషన్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ సరికొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్లో 100, 200, 400 మీటర్ల పరుగులో అతడు స్వర్ణ పతకాలు సాధించాడు. శుక్రవారం జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ స్వర్ణం సాధించాడు.
ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ చరిత్రలో తన పరుగుతో అభిమానులను ఉర్రూతలూగించిన బోల్ట్ ఈ మూడు ఈవెంట్లలో మూడు ఒలింపిక్స్ ల్లో మూడు స్వర్ణాలు సాధించిన ఆథ్లెట్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. బీజింగ్ (2008), లండన్ (2012), రియో (2016) ఒలింపిక్స్లో వరుసగా 100మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లలో ట్రిపుల్ ట్రిపుల్ సాధించి చరిత్ర సృష్టించాడు.
రియో ఒలింపిక్స్లో ఇప్పటికే 100 మీటర్లు, 200 మీటర్లు పరుగులో బోల్ట్ రెండు స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో పరుగుల మిషన్ వరుసగా మూడు ఒలింపిక్స్లో తొమ్మిది పతకాలను సాధించిన ఆథ్లెట్గా చరిత్ర సృష్టించి తనకు సాటి రాగల వారు సమీప భవిష్యత్తులో లేరని అతడు తేల్చి చెప్పాడు.
తాజాగా భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగిన 400 మీటర్లు పరుగు పందెంలో లక్ష్యాన్ని 37.27 సెకన్లలో బోల్ట్ చేధించాడు. ఇప్పటివరకూ ఒలింపిక్స్ చరిత్రలో బరిలోకి దిగిన తొమ్మిది ఈవెంట్లలో తొమ్మిది పతకాలను కైవసం చేసుకున్నాడు. ఈ తొమ్మిది కూడా స్వర్ణాలే కావడం విశేషం.