రియో డీ జెనీరో : ఆగస్టులో మొదలవబోతున్న ఒలింపిక్ క్రీడా సంగ్రామం కోసం బ్రెజిల్ సర్వ హంగులు సిద్దం చేసింది. ఆదివారం నాడు ఒలింపిక్ విలేజ్ లో అడుగుపెట్టిన అథ్లెట్స్ అందరికీ కండోమ్స్ తో స్వాగతం పలికారు రియో ఒలింపిక్ అధికారులు. ఒక్కో క్రీడాకారునికి 42 కండోమ్స్ ను పంపిణీ చేశారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న జికా వైరస్ విజ్రుంభిస్తోన్న నేపథ్యంలో.. ముందస్తు చర్యల్లో భాగంగా అథ్లెట్స్ అందరికీ కండోమ్స్ ను పంపిణీ చేశారు అధికారులు. దాదాపుగా 11వేల మంది హాజరవబోయే ఈ ఒలింపిక్స్ కోసం రికార్డు స్థాయిలో 4లక్షల 50వేల కండోమ్స్ ను పంపిణీ చేశారు అధికారులు. పురుష అథ్లెట్స్ తో పాటు మహిళా అథ్లెట్స్ కు కూడా ఈ దఫా కండోమ్స్ ను పంపిణీ చేయడంతో సంఖ్య మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది.
ఆస్థ్రేలియా అథ్లెట్స్ కొంతమంది యాంటీ వైరల్ కండోమ్స్ ను తమ వెంట తెచ్చుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ఒలింపిక్ సంఘం ప్రకటించింది. కాగా, గత 2012 లండన్ లో జరిగిన ఒలింపిక్స్ కోసం లక్షా 50వేల కండోమ్స్ ను అథ్లెట్స్ కు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
ఏర్పాట్లకు ఎలాంటి లోటు లేకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని సౌకర్యాలను అథ్లెట్స్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు బ్రెజిల్ ఒలింపిక్ విలేజ్ అధికారులు. 11వేల మంది అథ్లెట్స్, 6 వేల కోచ్ ల కోసం ప్రత్యేకంగా అధునాతన టవర్స్ ను నిర్మించింది బ్రెజిల్.