హైదరాబాద్: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్ లసిత్ మలింగ ఆ జట్టుకు బాహుబలి అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మంగళవారం నాడు చెప్పారు. సచిన్ టెండుల్కర్ హైదరాబాదులో సందడి చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. మలింగ ముంబై ఇండియన్స్ బాహుబలి అన్నారు. ముంబై ఇండియన్స్ జట్టు మెంటార్గా ఉండటం గౌరవమని చెప్పారు.
జట్టులో ఎంతమంది ఉన్నా మలింగ లాంటి ఆటగాడు చూపే ప్రభావం వేరు అన్నారు. మలింగకు మాత్రమే ఆ బౌలింగ్ శైలి సొంతమన్నారు. మలింగ బంతులు కచ్చితత్వంతో ఉంటాయన్నారు. అతనితో తనకు ప్రత్యేక అనుబంధముందని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్నమైన ఆటలు ఆడవచ్చన్నారు.
ఫలక్ నుమా ప్యాలెస్లో గతంలో రెండుసార్లు గడిపానని చెప్పారు. ఆ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. భాగ్యనగరంలో తనకు ఎన్నో మధుర అనుభూతులున్నాయన్నారు. స్పోర్ట్స్ పార్క్ ఏర్పాటుకు తాను కూడా సలహాలిచ్చానన్నారు.