హైదరాబాద్: ఇండియన్ బ్యాట్మింటన్ షట్లర్ సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. కెరీర్లోని అత్యుత్తమ ర్యాంక్ని సాధించింది. బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్కు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన తోలి భారతీయ మహిళగా రికార్డు సాధించారు.
ఇండియన్ ఓపెన్ సెమీస్లో కరోలినా మారిన్ ఓటమి చెందడంతో, సైనా నెహ్వాల్ మొదటి స్ధానాన్ని కైవసం చేసుకుంది. సెమీస్లో సైనా నెహ్వాల్ జపాన్కు చెందిన యూ హిసిమోటోతో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్తో సంబంధం లేకుండా సైనా నెహ్వాల్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుని సాధించడం విశేషం.
గతంలో పురుషుల బ్యాడ్మింటన్ ప్లేయర్స్లో ప్రకాశ్ పదుకొణె వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుని సాధించాడు.