బెంగళూరు: ఓవైపు కోర్టులో తిరుగులేని విజయాలు సాధి స్తూ, మరోవైపు వివిధ వ్యాపార సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సైనా నెహ్వాల్ ఇప్పుడు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడింది.
ప్రైజ్మనీల ద్వారా, ఒప్పందాల తర్వాత సంపాదించిన డబ్బంతా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. తనకు వ్యాపారం గురించి ఏమాత్రం తెలియదని ఆమె చెప్పింది. ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఏ వ్యాపారం ప్రారంభించాలన్నదానిపై ఏ మాత్రం పరిజ్ఞానం లేదని అన్నది.
ఈ తలనొప్పంతా నాన్న (హర్వీర్ సింగ్)కే వదిలేస్తానని సైనా చెప్పింది. కాగా, తాజాగా ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఎడెల్వీస్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహిరించేందుకు సైనా మరో ఒప్పందం కుదుర్చుకుంది.
ఎక్కడ పెట్టుబడులు పెట్టాలనే విషయం తనకు తెలియదని, డబ్బుల గురించి చర్చించకుండా తన తండ్రి తనను పెంచాడని, ఎలా విజయాలు అందుకోవాలని మాత్రమే తాను ఆలోచించే విధంగా పెంచారని చెప్పింది. తాను ఆటపై దృష్టిు కేంద్రీకరిస్తానని చెప్పింది.