టెన్నిస్లో అగ్రస్ధానంలో నిలవాలన్నదే లక్ష్యం
సింగపూర్లో జరిగిన డబ్ల్యుటీఏ ఫైనల్స్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోమవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంలో సానియా మిర్జా మాట్లాడుతూ "ఈ టైటిల్ నా దేశానికి అంకితం. నాకు అండగా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం కూడా నాకెంతో మద్దతుగా నిలిచింది. 37 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించడం గొప్పగా ఉంది" అని చెప్పింది.
టెన్నిస్లో అగ్రస్ధానంలో నిలవాలన్నదే లక్ష్యం
"మహేశ్ భూపతి, లియాండర్ పేస్, విజయ్ అమృత్ రాజ్, ఆనంద్ అమృత్ రాజ్, రమేశ్, రామనాథన్ కృష్ణన్ లాంటి గొప్ప ఆటగాళ్లను మనదేశం అందించింది. అలాంటి దిగ్గజాల మార్గనిర్దేశంలో డబ్ల్యుటీఏ టైటిల్ గెలవడం ఆనందంగా ఉంది." అని పేర్కొంది.
టెన్నిస్లో అగ్రస్ధానంలో నిలవాలన్నదే లక్ష్యం
"గొప్ప విజయంతో కారా బ్లాక్తో భాగస్వామ్యానికి వీడ్కోలు పలుకుతున్నా. ఈ టోర్నీ గ్రాండ్ స్లామ్ల కంటే కఠినమైంది. ప్రపంచంలోని 8 అత్యుత్తమ జట్లతో పోటీపడాలి. గ్రాండ్ స్లామ్లో క్వార్టర్ ఫైనల్ వరకు అగ్రశ్రేణి జోడీ ఎదురవదు. ఏదేమైనా అధ్బుత విజయంతో సీజన్ను ముగించడం ఆనందంగా ఉంది" అని సానియా పేర్కొంది.
టెన్నిస్లో అగ్రస్ధానంలో నిలవాలన్నదే లక్ష్యం
టెన్నిస్లో అగ్రస్ధానంలో నిలవాలన్నదే తన లక్ష్యమని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వెల్లడించారు. మంగళవారం సానియా మిర్జా మీడియాతో మాట్లాడుతూ 2014 తనకి బాగా కలిసొచ్చిందన్నారు. విజయానికి రహస్యాలేమీ లేవు.. టెన్నిస్ కోసం 21 ఏళ్లుగా కష్టపడుతున్నానని అన్నారు.
టెన్నిస్లో అగ్రస్ధానంలో నిలవాలన్నదే లక్ష్యం
తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ సానియా కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలవనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ అది చాలా మంచి కార్యక్రమమని పేర్కొన్నారు.