బీజింగ్: భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా జోడీ విజయపరంపర కొనసాగుతుంది. స్విస్ వెటరన్ తార మార్టినా హింగిస్తో కలిసి దూసుకుపోతున్న సానియా శనివారం వుహాన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది.
సానియా-హింగిస్ జోడీ మహిళల ఓపెన్ టైటిల్ను గెలుపొందింది. రుమేనియా జోడీపై 6-2, 6-3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సానియా-హింగిస్ జోడీ చైనీస్ తైపీ ద్వయం హావో చింగ్ చాన్-యంగ్ జాన్ చాన్ను ఓడించి ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే.
సానియా-హెంగిస్ జోడీ ఈ ఏడాది వరుసగా తమ సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది మొదట్లో వింబుల్డన్ గెలుపొందిన ఈ జోడీ, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. యూఎస్ ఓపెన్ సహా ఇప్పటివరకు ఏడు టైటిళ్లను సొంతం చేసుకున్నారు.