సానియా మీర్జా
పర్యావరణ పరిరక్షణ కోసం టెన్నిస్ తార సానియా మీర్జా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్తో ఆమె చేతులు కలిపారు. ఎర్త్ అవర్ 2015 పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు.
సానియా మీర్జా
దీనికి సంబంధించిన విషయాలను గురువారం సాయంత్రం తాజ్ కృష్ణా హోటల్లో డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్ ప్రతినిధులు, సానియా మీర్జా తెలిపారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడారు.
సానియా మీర్జా
అందరూ కలిసి ప్రయత్నిస్తే మార్పు సాధ్యమని చెప్పారు. ఈ ఎర్త్ అవర్ కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తుండటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
సానియా మీర్జా
చిన్న చిన్న అంశాలే పెను మార్పులు తెస్తాయని, అవసరం లేని చోట్ల లైట్లు తీసేయడం, నీరు అధికంగా వాడకుండా ఉండటం వంటి అంశాల ద్వారా పర్యావరణానికి మేలు చేయవచ్చునని చెప్పారు.
సానియా మీర్జా
ఇదే సమయంలో నిర్భయ కేసు నిందితుడు చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించేందుకు సానియా మీర్జా ఇష్టపడలేదు. అయితే, దీనిని తీవ్రంగా ఖండించారు.
సానియా మీర్జా
హైదరాబాదు అంతర్జాతీయంగా అత్యుత్తమ నగరాలలో ఒకటిగా నిలవడంతో పాటుగా దేశంలో బెస్ట్ సిటీగా ఎంపిక కావడం పట్ల స్పందించారు.
సానియా మీర్జా
హైదరాబాదు ఎప్పుడూ నెంబర్ వన్ సిటీనే అన్నారు. ఈ విషయం తాను ఎప్పుడూ చెబుతూనే ఉంటానని, ఇప్పుడు అది మారోమారు నిరూపితమైందన్నారు.