ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)కు ఎంపికైన తొలి భారతీయుడిగా సత్నాం సింగ్ చరిత్ర సృష్టించాడు. సత్నాం సింగ్ భమరానుని 52వ ఆటగాడిగా ఎంపకి చేస్తున్నట్లు డల్లాస్ మెవ్రిక్స్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
19 ఏళ్ల సత్నాం సింగ్ పంజాబ్లోని ఓ మారుమూల కుగ్రామానికి చెందిన వాడు. 7.2 అంగుళాల పొడవు ఉంటాడు. ఎన్బీఏ తదుపరి సీజన్లో ఆడనున్న 60 మంది యువ ఆటగాళ్లలో సత్నాం సింగ్ ఒకడు. ఐఎంజీ అకాడమీ తరుపున పలు అంతర్జాతీయ బాస్కెట్ బాల్ గేమ్ల్లో సత్నాం సింగ్ ఆడాడు.
సత్నాం సింగ్కు మందు ఏ భారతీయుడు కూడా ఎన్బీఏకు ఎంపిక కాలేదు. అయితే, కెనడాలో జన్మించిన భారత సంతతి యువకుడు గురుసిమ్రాన్ 'సిమ్' భుల్లార్ గత ఏడాది ఎన్బీఏకు ఆడాడు. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్బీఏలో కింగ్స్ తరుపున ఆడాడు.
ఎన్బీఏకు సత్నాం సింగ్ ఎంపిక అవడం పట్ల భారత బాస్కెట్ బాల్ అభిమానులు సోషల్ మీడియా వెబ్ సైట్లలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. డల్లాస్ మెవ్రిక్స్ మూడు డివిజన్ టైటిళ్లను(1987, 2007, 2010) గెలుచుకుంది. వీటితో పాటు 2001 సంవత్సరానికి గాను ఎన్బీఏ ఛాంపియన్ షిప్ను సొంతం చేసుకుంది.