సిడ్నీ: ప్రపంచ కప్ పోటీలకు ముందు భారత్పై పెద్దగా అంచనాలు లేవు. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో ఘోరంగా విఫలమైన ధోనీ సేన ప్రపంచ కప్ పోటీల్లో రాణిస్తుందని ఎవరూ పెద్దగా భావించలేదు. కానీ, ప్రపంచ కప్ లీగ్ దశలో భారత్ అనూహ్యమైన ప్రతిభ కనబరిచింది. వరుస విజయాలను అందుకుంది. లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది.
ఆరు జట్లను ఆలౌట్ చేసింది. అంటే భారత బౌలర్లు మొత్తం 60కి 60 వికెట్లు తీశారు. ఇది ప్రపంచ కప్ రికార్డు కూడా. క్వార్టర్ ఫైనల్ మ్యాచులోనూ బంగ్లాదేశ్ను ఆలౌట్ చేసింది. టీమిండియా వరుసగా అత్యధిక విజయాలు సాధించి మరో రికార్డు సృష్టించింది.
దాంతో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై కూడా భారత్ విజయం సాధిస్తుందనే అంచనాలు పెరిగాయి. అయితే, సెమీ ఫైనల్ మ్యాచు అంచనాలను తారుమారు చేసింది. భారత క్రికెటర్లు ఆస్ట్రేలియాకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. వరుసగా ఏడు మ్యాచుల్లో ప్రత్యర్థి జట్టను ఆలౌట్ చేసిన భారత్ బౌలర్లు ఈ మ్యాచులో తేలిపోయారు.
బ్యాట్స్మెన్ కూడా పూర్తిగా విఫలమయ్యారు. మేటి బ్యాట్స్మెన్ అనుకున్న విరాట్ కోహ్లీ, సురేష్ రైనా కూడా బ్యాట్లెత్తేశారు. దాంతో మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. చివరకు ఆతిథ్య జట్లే ఫైనల్కు చేరుకున్నాయి. ఆదివారంనాడు ఈ నెల 29వ తేదీన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.