హైదరాబాద్: ఇటీవల లండన్ వేదికగా ముగిసిన వరల్డ్ ఛాంపియన్షిప్లో తన ఆఖరి పరుగులో ఉసేన్ బోల్ట్ అభిమానులను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. 4×100 రిలే రేసులో ఆఖరి అంచెలో పరుగెత్తిన బోల్ట్ గాయంతో ట్రాక్పై అనూహ్యంగా కుప్పకూలిన సంగతి తెలిసిందే.
దీంతో స్వర్ణంతో కెరీర్కు వీడ్కోలు పలుకాలన్న బోల్ట్ ఆశలు నెరవేరలేదు. ఈ నేపథ్యంలో తన గాయంపై వస్తున్న అనుమానాలపై ఉసేన్ బోల్ట్ సోషల్ మీడియాలో స్పందించాడు. చివరి రేస్లో ఉసేన్ బోల్ట్ ట్రాక్పై కుప్పకూలిపోవడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఉసేన్ బోల్డ్కు ఎంతో బాధ కలిగించాయి. దీంతో తన గాయానికి సంబంధించిన మెడికల్ రిపోర్టలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 'గాయం వల్ల రేసు పూర్తి చేయలేకపోయాను. కోలుకోవడానికి మూడు నెలల సమయం పడుతుంది. సాధారణంగా నా వైద్య నివేదికలను వెల్లడించను. కానీ గాయం నిజం కాదంటూ వస్తున్న వదంతులకు ముగింపు పలకాలనే ఇలా చేస్తున్నా' అని ఉసేన్ బోల్ట్ పేర్కొన్నాడు.
'నా అభిమానులను నేనెప్పుడూ మోసం చేయాలని అనుకోలేదు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో చివరి సారిగా నా అభిమానుల కోసం పరిగెత్తాను. మీ మద్దతుకు ధన్యవాదాలు. గాయం మానేంత వరకూ విశ్రాంతి తీసుకుని తర్వాతి జీవితానికి స్వాగతం పలుకుతాను' అని బోల్ట్ అందులో పేర్కొన్నాడు.
— Usain St. Leo Bolt (@usainbolt) 16 August 2017