బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ చీరకట్టుతో మురిసిపోయింది. అమెరికా టెన్నిస్ స్టార్ అయిన వీనస్.. ఛాంపియన్స్ టీమ్స్ లీగ్ కోసం బెంగళూరుకు ఇటీవల వచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆమె ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.
పసుపు పచ్చ రంగు, బంగారు వర్ణం బార్డర్ ఉన్న చీరను ధరించి అలరించారు. ఈ చీరను రీతు కుమార్ డిజైన్ చేశారు. దాని పైన ఎరుపు రంగు జాకెట్ ధరించారు. అనంతరం చీరతో ర్యాంప్ పైన హొయలు పోయారు. వీనస్ విలియమ్స్ తనకు సూట్ అయ్యే చీరను ఎంచుకొని కట్టుకున్నారు.
వీనస్ విలియమ్స్ తనకు సూటైన చీరను ఎన్నుకొని కట్టుకున్నారని, క్రీడల నుండి వచ్చిన వీనస్.. భారత్కు, అంతర్జాతీయానికి కొత్త గ్లామర్ అద్దారని డిజైనర్ అభిప్రాయపడ్డారు. కాగా, వీనస్ విలియమ్స్ రాంప్ పైన నడవటమే కాకుండా.. బాలీవుడ్ స్టైల్లో స్టెప్పులు వేసి కూడా అలరించారు.
కాగా, వీనస్ విలియమ్స్ సింగిల్స్లో ఏడు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ గెలుచుకున్నారు. ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించారు. ఆమె వయస్సు 34. వీనస్ విలియమ్స్ సోదరి సెరీనా విలియమ్స్. సెరీనా టెన్నిస్ ఆటలో నెంబర్ వన్గా కొనసాగుతున్నారు. కాగా, వీనస్ విలియమ్స్ ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్లో బెంగళూరు రాపోర్ట్స్ తరఫున ఆడుతున్నారు.