న్యూఢిల్లీ: ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా మార్చి 19న చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మరోసారి కొత్త 'మౌకా మౌకా' ప్రకటన విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ప్రకటనలో పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి ఆ దేశ అభిమాని ఆవేదనతో తమ జట్టే గెలవాలని కోరుకుంటాడు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే విడుదలైన ఈ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. టీమిండియా ఆటగాళ్లకు సిక్సెస్ ఎలా కొట్టాలో చూపించాలంటూ షాహిద్ అఫ్రిదీని కోరాడు.
'ఇప్పటికే భారత్ చేతిలో నాలుగు సార్లు ఓడిపోయాం.. ఇప్పుడు వారికి సిక్సులు ఎలా కొట్టాలో చూపించాలి' అని అభిమాని మౌకా మౌకా ప్రకటనలో కోరతాడు.
భారత్-పాక్ మ్యాచు కోసం ఇరుదేశాల అభిమానులు ఎంతో ఉత్కంఠతో వేచిచూస్తున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ ఫేవరేట్ గా ఉన్నప్పటికీ తొలి మ్యాచులో న్యూజిలాండ్తో చేతిలో ఓటమి పాలవడం భారత అభిమానులను నిరాశకు గురిచేసింది.