ముంబై: క్రికెట్ క్రీడ పట్ల సచిన్ టెండూల్కర్కు ఉన్న నిబద్ధత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మ్యాచ్ జరిగే వేదిక వద్దకు చేరుకోవడానికి ఆయన ఓసారి ప్రైవేట్ టాక్సీలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. కారు నడుపుతున్నప్పుడు తనకు ఓసారి చేదు అనుభవం ఎదురైందని, నాగపూర్లో జరిగే వన్డే మ్యాచ్కు వెళ్లాల్సి ఉండిందని, ముంబై నుంచి ఉదయం ఆరు లేదా ఆరున్నర గంటలకు విమానం ఉందని ఆయన చెప్పారు.
తాను విమానాశ్రయానికి వెళ్తుండగా మధ్యలో ఉదయం ఐదున్నర గంటలకు తన కారు టైర్ పంక్చరయిందని, దాంతో తాను సకాలంలో విమానాశ్రయం చేరుకోవడానికి టాక్సీ తీసుకోవాల్సి వచ్చిందని సచిన్ టెండూల్కర్ చెప్పారు. టాక్సీ దొరుకుతుందో లేదో అనే టెన్షన్ కూడా తనను పట్టుకుందని చెప్పారు.
స్మాష్లో గో - కార్టింగ్ రూఫ్టాప్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఆయన శుక్రవారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సంచులతో విమానాశ్రయానికి టాక్సీ, రిక్షా కాంబినేషన్ అని, ఆ రోజు తాను ప్రాక్టీస్ చేయగలిగానని, ఇది తాను ఎదుర్కున్న డ్రైవింగ్కు సంబంధించిన తాను ఎదుర్కున్న సవాళ్లలో ఒకటని ఆయన అన్నారు.
తనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని సచిన్ చెప్పారు. కార్టింగ్ అంటే మరీ ఇష్టమని చెప్పారు. న్యూజిలాండ్, జర్మనీ, ఇంగ్లాండు, ప్రతి చోటా తాు కార్టింగ్ చేసినట్లు తెలిపారు. తాను తన మిత్రుడు సంజయ్ నారంగ్ కోసం ట్రాక్ను డిజైన్ చేశానని, ఆ ట్రాక్పై రేసింగ్ చేస్తుంటే ఎంతో వినోదమని అన్నారు. సంజయ్ నారంగ్ కోసం డిజైన్ చేసిన ట్రాక్పై కార్టింగ్ చేసినప్పుడు తాను ఎక్కువ వినోదించానని, తాము రాత్రి వేళల్లో కార్టింగ్ చేసేవాళ్లమని చెప్పారు.
కార్టింగ్ను ప్రోత్సహిస్తే ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారవుతారని ఆయన చెప్పారు. భారతదేశంలో అన్ని క్రీడలను ప్రోత్సహించాలని, వాటిలో కార్టింగ్ ఒక్కటని సచిన్ టెండూల్కర్ అన్నారు.