బీజింగ్: చైనాలోని బీజింగ్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ మరోసారి సత్తా చాటాడు. వరుసగా నాలుగో సారి స్వర్ణం సాధించాడు. గురువారం జరిగిన పురుషుల 200 మీటర్ల ఫైనల్ రేసులో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
బోల్ట్ 200 మీటర్ల దూరాన్ని 19.55 సెకన్లలో పూర్తి చేశాడు. అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్ 19.74 సెకండ్లతో రెండో స్థానంలో సరిపెట్టుకున్నాడు. 200 మీటర్ల పరుగు పందెంలోనైనా బోల్ట్ను ఓడించాలన్న గ్లాటిన్ కల ఫలించలేదు. గత ఆదివారం జరిగిన 100 మీటర్ల రేసులోనూ బోల్ట్ విజయం సాధించాడు.
గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొన్న బోల్ట్ చివరకు సెకనులో వందోవంతు తేడాతో గట్టెక్కి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఇప్పటివరకు ఉసేన్ బోల్ట్ 10 బంగారు పతకాలు గెలిచాడు.
Careful careful! #thoseareexpensivelegs #Beijing2015 pic.twitter.com/dQYtxew9CR
— Kareem Streete-Thomp (@kaystreete) August 27, 2015