న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుష్క ఇష్యూ తెచ్చిన తంట!: మీడియాకు కోహ్లీ దూరం, సహచరులతోనూ..

By Srinivas

పెర్త్: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం ఓ జర్నలిస్ట్ పైన కోహ్లీ మండిపడిన విషయం తెలిసిందే. తన ప్రియురాలు అనుష్క శర్మ, తనకు సంబంధించిన ఓ వార్తా కథనం పైన అతను తిట్టాడు. అయితే ఆ వార్త రాసింది ఆ పాత్రికేయుడు కాదని తెలిసుకొని క్షమాపణలు చెప్పాడు.

దీనిపై సదరు విలేకరి ఐసీసీ, బీసీసీఐలకు ఫిర్యాదు చేశాడు. దీనిపై బీసీసీఐ కూడా తీవ్రంగానే స్పందించింది. ఈ విషయం ఇంతటితో వదిలేయాలని, అతను సదరు జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెప్పాడని, ఇక ప్రపంచ కప్ పైన దృష్టి సారించాలని కోరింది. అదే సమయంలో కోహ్లీని హెచ్చరించింది.

World Cup 2015: Subdued Virat Kohli stays away from media

ఈ నేపథ్యంలో కోహ్లీ.. మీడియాకు దూరంగా ఉంటున్నాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు రెండు రోజులుగా నెట్లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో మీడియాతోనే కాదు.. జట్టు సహచరులతోను అంతగా మాట్లాడలేదని తెలుస్తోంది. నెట్లో గంభీరంగా కనిపించాడు.

నెట్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గానీ, ఆ తర్వాత లేదా అంతకుముందు గానీ.. మీడియా ఉన్న వైపు కోహ్లీ ఒక్కసారి కూడా చూడలేదట. నెట్లో ఉన్న ఇతర బ్యాట్స్‌మెన్ తమ వంతు వచ్చే వరకు అక్కడే నిరీక్షించారు. కోహ్లీ మాత్రం డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లడం, నెట్లో ప్రాక్టీస్ చేయడం, ఆ తర్వాత బస్సెక్కి హోటల్‌కు వెళ్లడం.. అంతే చేశాడని తెలుస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X