: ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో పెర్త్లో శుక్రవారం నాడు జరుగుతున్న మ్యాచ్లో భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కాసేపు ప్యాడ్లు లేకుండానే కీపింగ్ చేశాడు. భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది కనిపించింది.
ధోని తన ప్యాడ్లను రహానేకు ఇచ్చాడు. అశ్విన్ వేసిన కొన్ని బంతులకు అలాగే కీపింగ్ చేశాడు. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ జోనాథన్ కార్టర్ స్ట్రైకింగ్ సైడ్లో ఉన్నాడు.
ధోనీ ఫార్వార్డ్ షార్ట్ లెగ్ సైడ్ ఫీల్డ్కు అజింక్యా రహానేను పిలిచాడు. ఆ సమయంలో మరో ప్యాడ్స్ కోసం సమయం వృథా చేయకుండా తన ప్యాడ్స్ అతనికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కాసేపటికి ధోనీ మళ్లీ ప్యాడ్లు ధరించాడు. కాగా, కీపర్ కాళ్లకు రక్షణ లేకుండా కీపింగ్ చేయడం చాలా అరుదు.