ముంబై: ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఓటమి అనంతరం భారత జట్టు ఆటగాళ్లు భారత్కు తిరిగి వచ్చారు. జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తదితరులు శుక్రవారం రాత్రి ఆస్ట్రేలియా నుండి వచ్చారు. తమ తమ ప్రాంతాలకు వెళ్లారు.
మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. విరాట్ కోహ్లీ, ప్రియారులు అనుష్క శర్మ, మరో ఐదుగురు ఆటగాళ్లు, టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రిలు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు.
రోహిత్ శర్మ, అజింక్యా రహానే, రవీంద్ర జడెజా, అక్షర్ పటేల్లు కూడా ఆస్ట్రేలియా నుండి ముంబైకి వచ్చారు. ఈ విషయాన్ని క్రికెట్ బోర్డ్ వర్గాలు శనివారం నాడు తెలిపాయి. మిగతా ఆటగాళ్లు కూడా ఈ రాత్రికి వస్తారని వారు చెప్పారు.
కాగా, టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, ఆయన ప్రేయసి అనుష్క శర్మ చేతిలో చేయి వేసుకుని ముంబై విమానాశ్రయంలో కనిపించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాపై ఐసిసి ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి ఆ ప్రేమ జంట తిరిగి వచ్చింది. వారు సాధారణమైన దుస్తుల్లో పరస్పరం చేతులు పట్టుకుని కనిపించారు.