న్యూఢిల్లీ: సింగపూర్లో జరుగుతున్న డబ్ల్యూటీఏ ఫైనల్స్లో మహిళల డబుల్స్ విభాగంలో భారత్కు చెందిన సానియా మిర్జా, స్విట్జర్లాండ్కు చెందిన మార్టినా హింగిస్ జోడీ సెమీ ఫైనల్స్కు దూసుకెళ్లింది. తొలి మ్యాచ్లో భాగంగా చైనీస్ తైపీకి చెందిన జోడీ హోచింగ్ చాన్-యంగ్ జాన్ చాన్పై 7-6, 12-10, 7-5 తేడాతో సానియా-హింగిస్ జోడీ విజయం సాధించింది.
స్విట్జర్లాండ్కు చెందిన మార్టినా హింగిస్తో కలిసి మహిళల డబుల్స్లో అపూర్వ విజయాలను అందుకున్న సానియా జులైలో విడిపోయింది. ఆ తర్వాత సానియా కొంత కాలం పాటు వేర్వేరు భాగస్వాములతో కలిసి ఆడింది. అయితే డబ్ల్యూటీఏ టైటిల్ను కాపాడుకునేందుకు గాను ఈ జోడీ మళ్లీ ఒక్కటైంది.
సానియాతో గొడవ లేదు, అసలు కారణం ఇదీ: హింగిస్
కాగా, జులైలో విడిపోయే సమయానికి ఈ జోడీ ప్రపంచ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలో ఉంది. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు మూడు గ్రాండ్ శ్లామ్, 11 డబ్ల్యూటీఏ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో తిరుగులేని ఆధిక్యాన్ని కనబర్చిన ఈ జోడీ విడిపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
/news/sports/martina-hingis-says-recent-poor-results-main-reason-split-wi-182257.htmlఅయితే, డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ను నిలబెట్టుకోవడానికి మార్టినా హింగిస్తో కలిసి సానియా దోస్తీ కట్టి సత్తా చాటింది. హింగిస్తో విడిపోయిన తర్వాత బార్బరా స్ట్రికోవాతో కలిసి సానియా డబుల్స్ ఆడింది. హింగిస్ తనకు జోడీగా అమెరికాకు చెందిన కొకొ వాండెవాగ్ను ఎంచుకుంది.
80 వారాలు: సానియా Vs మంజ్రేకర్, ట్విట్టర్లో మాటల యుద్ధం
అయితే సింగపూర్ డబ్ల్యూటీఏ ఫైనల్స్లో వాళ్లిద్దరూ ఎంపిక చేసుకున్న భాగస్వాములతో కలిసి ఆడేందుకు ఇష్టపడక పోవడం, టైటిల్ను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ జోడీ కట్టారు. ఇదిలా ఉంటే డబ్ల్యూటీఏ ప్రకటించిన డబుల్స్ ర్యాంకింగ్స్లో సానియా మీర్జా వరుసగా 81వ వారం కూడా టాప్ ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే.