ఎయిరిండియా ఉద్యోగినిపై ఆటో డ్రైవర్ దాడి: నగలు చోరీ
హైదరాబాద్: మెహదీపట్నంలో ఎయిర్ ఇండియా ఉద్యోగినిపై దాడి జరిగింది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. ఎయిర్ ఇండియా ఉద్యోగినిపై దాడి చేసి 7 తులాల నగలను ఆటోడ్రైవర్ ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
బాధితురాలి ఫిర్యాదు మేరకు హుమాయూన్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల సహకారంతో ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ హంగామా
నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఓ నకిలీ డాక్టర్ సోమవారం హంగామా చేసింది. వైద్యం చేస్తానంటూ రోగుల దగ్గరకు శివాని అనే మహిళ డాక్టర్ వేషంలో వచ్చింది. మహిళపై అనుమానం వచ్చిన రోగుల బంధువులు, ఆస్పత్రి సిబ్బంది ఆమెను పట్టుకుని చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.
ఆమెను విచారించగా దొంగతనం కోసం వచ్చినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.