మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుటుంబ కలహాలు: ఇంజినిరింగ్ విద్యార్థి ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కుటుంబ కలహాలతో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 23 ఏళ్ల సాయి వర్ధన్‌రెడ్డి అనే విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అతను ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలు ఆ ఇంట్లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు ఆ సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య

A Engineering student allegedly committed suicide

రంగారెడ్డి: వికారాబాద్‌లోని ఎడ్లబజార్‌లో విషాదం చోటు చేసుకుంది. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను శేఖర్, చంద్రకళగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మెదక్: జిల్లాలోని చేగుంట మండలం రెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A Engineering student allegedly committed suicide in Hyderabad on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X