వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో కెసిఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు

కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో చేదు అనుభవం ఎదురైంది. కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకులు హైద్రాబాద్ లో ర్యాలీ నిర్వహించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో చేదు అనుభవం ఎదురైంది. కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకులు హైద్రాబాద్ లో ర్యాలీ నిర్వహించారు.అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న కొందరు మహిళ కార్యకర్తలు కెసిఆర్ కు జై కొట్టారు.

ప్రసూతి ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపర్చాలంటూ ఆందోళన కార్యక్రమాలను తెలంగాణ మహిళ కాంగ్రెస్ నాయకులు గురువారం నాడు హెచ్ ఆర్ సి వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అయితే ర్యాలీలో ఓ నేత కెసిఆర్ అనగానే అక్కడ ఉన్నవారంతా కేసీఆర్ జిందాబాద్ , సీఏం అనగానే జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.దీంతో కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకులు నాలుక కరుచుకొన్నారు.

A shocking incident in Congress party rally at Hyderabad

దీంతో కాంగ్రెస్ నేతలు షాక్ గురయ్యారు. టిఆర్ఎస్ సభ కారణమో, ఇతర కారణాలు ఏమిటో తెలియదు కాని నినాదాల్లో రివర్స్ పంచ్ పడడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ర్యాలీలోనే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా జై కొట్టడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు హాతాశులయ్యారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

English summary
A shocking incident happend in Congress party rally held in Hyderabad on Thursday. some party workers favour slogans for Kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X