వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
హన్మకొండ పోలీస్స్టేషన్ పరిధిలో కొత్తూర్లో నివాసముంటున్న వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
వరంగల్: హన్మకొండ పోలీస్స్టేషన్ పరిధిలో కొత్తూర్లో నివాసముంటున్న వివాహిత ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ ఇన్స్పెక్టర్ సంపత్రావు తెలిపిన ప్రకారం... మంచిర్యా జిల్లా మందమర్రి పట్టణం రామకృష్ణపురానికి చెందిన భాస్కర్తో గతేడాది ఆగస్టులో సమతతో వివాహమైంది.
భాస్కర్ ప్రవేటు కంపెనీలో పని చేస్తుండటంతో హప్మకొండ కొత్తూరులో అద్దెకు ఇళ్లు తీసుకుని నివాసముంటున్నారు. పెళ్లి సమయంలో రూ. 7 లక్షల కట్నం ఇస్తామని ఒప్పుకొని కొంత ఇచ్చారు. మిగిలిన కట్నం కావాలని భాస్కర్.. సమతను వేధించడంతో ఆమె గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. మృతురాలి తండ్రి గంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు.
మోసం చేసిన వ్యక్తి అరెస్టు
తన పేరిట భూమి లేకున్నా... ఉన్నట్లు నమ్మించి నుగురికి విక్రయించి మోసం చేశాడనే ఆరోపణపై పోరిక రాజు నాయక్ను శుక్రవారం ములుగు పోలీసు అరెస్టు చేశారు. శుక్రవారం డీఎస్పీ దక్షిణామూర్తి తన కార్యాయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిందితుడి అరెస్టును చూపారు.
డీఎస్పీ కథనం ప్రకారం.. ములుగులో నివాసం ఉంటున్న పోరిక రాజునాయక్ తన పేరున ఎలాంటి భూమి లేకున్నా బండారుపల్లి శివారులో భూమి ఉన్నట్లుగా తప్పుడు సర్వేనెంబర్లతో స్టాంపు కాగితాు రాసిచ్చి నుగురికి విక్రయించాడు. ఆయన తండ్రి హర్జినాయక్ పేరున 20 గంఉటు అసైన్డ్ భూమి ఉంది. దీనిని అమ్మడం గారీ. కొనడం గానీ నేరం. రాజునాయక్ తన తండ్రి పేరున ఉన్న 20 గుంటకు తోడు మరో 15 గుంట ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు.
ఇందులో 20 గుంటను తొలుత ములుగుకు చెందిన గడ్డమీది భాస్కర్కు రూ. 5.75లక్షలకు, మరి కొద్ది రోజు తర్వాత కొప్పు నరేందర్, విజేందర్, విజయ్కుమార్కు 15 గుంటకు రూ. 4.42 లక్షలకు విక్రయించాడు. వాటిని తమ రిజిస్ట్రేషన్ చేయించాని రాజునాయక్పై ఒత్తిడి చేయగా... తప్పించుకొని తిరుగుతున్నాడు.
అనుమానం వచ్చిన భాస్కర్, విజయ్కుమార్ ముగు తహసీల్దార్ కార్యాయానికి వెళ్ళి రికార్డు పరిశీలించారు. దీంతో అసు విషయం మెగులోకి వచ్చింది. వెంటనే ములుగు పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని డీఎస్పీ ఎప్పారు. సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మల్లేయాదవ్ పాల్గొన్నారు.