మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడి మోజులోపడి.. కన్న కూతురినే హత్య చేసింది

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని.. ఓ దుర్మార్గురాలు కన్న కూతురినే హతమార్చింది. ఈ ఘటన జిల్లాలోని జమ్మికుంట మండలం మల్యాల గ్రామంలో జరిగింది.

ప్రియుడి మోజులో పడ్డ ఆమె.. నవమాసాలు మోసి కని పెంచిన కూతురునే దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే కారణంతో ప్రియుడుతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది.

కాగా, భర్త ఇచ్చిన పిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, తమదైన శైలిలో విచారించగా ఈ విషయం బయటపడింది. స్థానిక తహసీల్ధార్ సమక్షంలో పూడ్చిపెట్టిన బాలిక మృతదేహన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు.

A woman allegedly murdered her daughter for her paramour

బైక్‌ను ఢీకొన్న లారీ: వీఆర్‌వో మృతి

మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలం చిన్నగొట్టిముళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వీఆర్‌వో కిషన్‌రావు మృతి చెందారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సమావేశానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

చేగుంట మండలం నార్సింగిలో కిషన్‌రావు వీఆర్‌వోగా పనిచేస్తున్నారు. మెదక్ జిల్లా వీఆర్‌వోల సంఘం గౌరవ అధ్యక్షుడిగా కిషన్‌రావు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman allegedly murdered her daughter for her paramour in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X