అమెరికాలో తెలుగు టెక్కీ మృతి: 'బొట్టు పెట్టుకోవడం ద్వారా రక్షించుకోండి'
ప్రపంచవ్యాప్తంగా నివసించే హిందూ మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలని, హిందూ పురుషులు తమ నుదుటన తిలకం దిద్దుకోవాలని హిందూ సంహతి అధ్యక్షులు తపన్ ఘోష్ అన్నారు.
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా నివసించే హిందూ మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలని, హిందూ పురుషులు తమ నుదుటన తిలకం దిద్దుకోవాలని హిందూ సంహతి అధ్యక్షులు తపన్ ఘోష్ అన్నారు.
కన్సాస్ కాల్పుల ఘటనలు వంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇదే సరైన చర్య అన్నారు. ముస్లీం ఉగ్రవాదాన్ని దృష్టిలో ఉంచుకొని హిందువులు నుదుటిన తిలకం, బొట్టు పెట్టుకోవడం ద్వారా తమను తాము రక్షించుకోవచ్చన్నారు.
టెక్కీ మృతిపై దత్తాత్రేయ, కేంద్రానికి కేటీఆర్: 'ట్రంప్! ఈ శోకం ఎవరికీ వద్దు'
శ్రీనివాస్, ఆయన మిత్రుడిని పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవారిగా భావించి కాల్పుల జరిపానని నిందితుడు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందువులు తమ మతం తెలిసేలా ఈ చిహ్నాలు పాటించాలని తపన్ సూచించారు.
పరిస్థితుల దృష్ట్యా భద్రత కోసం ఈ సూచన చేస్తున్నానని తెలిపారు. ఇతర మతాల చిహ్నాలు ధరించడం ద్వారా తమను తాము దాడుల నుంచి కాపాడుకోవాలని ముస్లింలకు ఇస్లాం మత పెద్దలు సూచించాలని కూడా తపన్ వ్యాఖ్యానించడం గమనార్హం.