హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజృంభణ: ఎయిర్ ఫోర్స్ సిబ్బందికీ స్వైన్ ప్లూ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ప్లూ రోజు రోజుకీ విజృంభిస్తుంది. సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రిలోని కొంత మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి కూడా ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే 52 కొత్త స్వైన్ ప్లూ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు.

దీంతో స్వైన్ ప్లూ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 25కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 390 స్వైన్ ప్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్వైన్ ప్లూ వ్యాధిని నియంత్రించడంలో విఫలమైనందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్యను, సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.

Air force staff suffering from swine flu

స్వైన్ ప్లూ లక్షణాలతో మిరుగుదొడ్డివాసి గాంధీ ఆసుపత్రికి తరలింపు

మెదక్ జిల్లాలోని మిరుగుదొడ్డి మండల పరిధిలోని కొండాపూర్‌లో స్వైన్ ప్లూ లక్షణాలతో ఓ వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బీమరి నర్సింహులు అనే వ్యక్తికి స్వైన్ ప్లూ లక్షణాలు కనిపించడంతో మిరుగుదొడ్డి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి వెంటనే నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

English summary
Air force staff suffering from swine flu in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X