మరో సెక్స్ రాకెట్: ఆంధ్రా, బెంగాల్ అమ్మాయిలతో వ్యభిచారం..
మాదాపూర్ కేంద్రంగా జరుగుతున్న ఈ సెక్స్ రాకెట్ పై దాడి చేసి.. పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్లో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. ఆంధ్రాతోపాటు బెంగాల్ రాష్ట్రాలనుంచి అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాదాపూర్ కేంద్రంగా జరుగుతున్న ఈ సెక్స్ రాకెట్ పై దాడి చేసి.. పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రమేష్ అలియాస్ సాయి రమేష్ తన స్నేహితుడైన విజయవాడకు చెందిన మురళీ (24), పశ్చిమబెంగాల్కు చెందిన ఒక యువతి(22)తో కలిసి మాదాపూర్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కొంతమంది బ్రోకర్ల సహాయంతో ఆంధ్రా, బెంగాల్ అమ్మాయిలను ఇక్కడకు రప్పించి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో.. ఫ్లాట్ పై దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. రాజమండ్రికి చెందిన మరో మహిళను, విటుడు షేక్ తౌఫీక్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సమయంలో రూ.1580నగదుతో పాటు, నాలుగు సెల్ ఫోన్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.