అదీ మేం!: ఈటెల, దత్తాత్రేయ హెల్ప్ కోరిన కడియం
హైదరాబాద్: ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణను నిర్మించడం ఆచరణలో నిరూపించుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో బుధవారం నగరంలోని రవీంద్ర భారతిలో కళామందిరంలో సంచార జాతుల కళా ప్రదర్శన, రాష్ట్ర మహాసభ జరిగింది.
హాజరైన ఈటెల మాట్లాడారు. మరికొద్ది రోజుల్లో గొప్ప మార్పులతో కూడిన పరిపాలన, అభివృద్ధి జరగబోతోందన్నారు. పేదలకు పక్కా ఇళ్ల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కళామందిరం
ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణను నిర్మించడం ఆచరణలో నిరూపించుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం అన్నారు.
కళామందిరం
తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో బుధవారం నగరంలోని రవీంద్ర భారతిలో కళామందిరంలో సంచార జాతుల కళా ప్రదర్శన, రాష్ట్ర మహాసభ జరిగింది.
కళామందిరం
హాజరైన ఈటెల మాట్లాడారు. మరికొద్ది రోజుల్లో గొప్ప మార్పులతో కూడిన పరిపాలన, అభివృద్ధి జరగబోతోందన్నారు. పేదలకు పక్కా ఇళ్ల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కళామందిరం
పేదలకు పక్కా ఇళ్ల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో సంచార జాతులకు ప్రాధాన్యం ఇస్తామని ఈటెల చెప్పారు.
కళామందిరం
సంచార జాతుల కష్టాలు తీరాలంటే వారికి ప్రత్యేక కార్పోరేషన్ ఉండాల్సిందేనని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఈ సందర్భంగా అన్నారు.
కళామందిరం
రాబోయే బడ్జెట్ సమావేశంలో ప్రత్యేక బడ్జెట్ ఉండేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడుతానని ఆయన చెప్పారు.
దత్తాత్రేయ
సర్వశిక్ష అభియాన్, ఇతర పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు వేగంగా మంజూరు అయ్యేలా చూడాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి వేరుగా కోరారు.
దత్తాత్రేయ
త్వరలో తాను ఢిల్లీ వెళ్లి మానవవనరుల మంత్రిత్వ శాఖ అధికారులను కలుస్తానని ఈ సందర్భంగా ఆయన బుధవారం నాడు చెప్పారు.
దత్తాత్రేయ
బుధవారం కడియం శ్రీహరి హైదరాబాదులో దత్తాత్రేయను కలిశారు. తెలంగాణకు మరింత విద్యుత్, బొగ్గు నిల్వలను కేటాయించాలంటూ ప్రధానికి రాసిన లేఖ విషయం వారి మధ్య చర్చకు వచ్చింది. కడియంకు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ఆయనను సన్మానించారు.