‘డిగ్గీకి తెలంగాణ సర్కారు బంపర్ ఆఫర్! ఎర్రగడ్డలో ఉచిత చికిత్స’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ దిగ్విజయ్ సింగ్పై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డ్రగ్స్ కేసులో తెలంగాణ అధికార పార్టీ వారసుల స్నేహితులే నిందితులుగా ఉన్నారని, వారిని ఏం చేస్తారో? అంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలు కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సుమన్ మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారును మెచ్చుకోవాల్సిందిపోయి నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ స్థాయికి తగదని విమర్శించారు.
మతిస్థిమితం కోల్పోయి వ్యాఖ్యలు చేస్తున్న దిగ్విజయ్సింగ్కు తెలంగాణ ప్రభుత్వం మంచి ఆఫర్ ఇస్తున్నదని, హైదరాబాద్లోని ఎర్రగడ్డ దవాఖానాలో ఉచితంగా చికిత్స అందజేస్తామని అన్నారు.
డ్రగ్స్ వంటి విష సంస్కృతిని కూకటివేళ్లతో సహా పెకిలించాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ మాఫియా అంతుచూడాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని ఎంపీ బాల్క సుమన్ అన్నారు.