చార్మీకి ఛాన్స్ లేదు, విచారణ అక్కడే: ముమైత్ను విచారించేందుకు లేడీ ఆఫీసర్స్
నటి చార్మీ రేపు ఎక్సైజ్ కార్యాలయంలోనే విచారణకు హాజరు కావాలా? ఇప్పుడు తాను కోరుకున్నచోట విచారణకు హాజరు కాలేరా? అంటే అవుననే అంటున్నారు సిట్ తరఫు లాయర్.
హైదరాబాద్: నటి చార్మీ రేపు ఎక్సైజ్ కార్యాలయంలోనే విచారణకు హాజరు కావాలా? ఇప్పుడు తాను కోరుకున్నచోట విచారణకు హాజరు కాలేరా? అంటే అవుననే అంటున్నారు సిట్ తరఫు లాయర్.
చదవండి: అనవసరంగా కోర్టుకెక్కారా: పూరీని ఎందుకు లాగారు, చార్మి తొందరపడ్డారా?
చార్మీకి నోటీసులు ఇచ్చిన సమయంలోనే మీరు ఎక్కడ అంటే అక్కడ విచారణ జరుపుతామని చెప్పామని, ఆమె ఎక్సైజ్ శాఖ కార్యాలయానికే వస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు విచారణ ప్రాంతాన్ని మార్చేది లేదన్నారు.
సిట్ ఎదుట హాజరయ్యేందుకు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి రావాల్సిందే అన్నారు. ఇప్పుడు విచారణ ప్రాంతాన్ని మార్చలేమని తేల్చి చెప్పారు. ఆమె నుంచి బలవంతంగా శాంపిల్స్ సేకరించమని చెప్పారు.
చదవండి: రేవంత్ రెడ్డిపై నాయిని సంచలనం, బిజెపి నేత ఘాటు కౌంటర్
రేపు విచారణకు చార్మీ: అకున్ సబర్వాల్
నటి చార్మీ రేపు (బుధవారం) విచారణకు హాజరవుతారని అకున్ సబర్వాల్ చెప్పారు. మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, మరో ముగ్గురు వ్యాపారులను విచారించామని చెప్పారు.
చదవండి: షాకింగ్, బిగ్ షాట్స్ పేరు చెప్పిన నవదీప్: విదేశీ డ్రగ్ మాఫియాతో లింక్, అగ్రహీరోలు, హీరోయిన్లు
ముమైత్, చార్మీలను విచారించిందుకు నలుగురు మహిళా ఆఫీసర్లు
ముమైత్ ఖాన్, చార్మిలను విచారించేందుకు నలుగురు మహిళా అధికారులను నియమించారు. సిట్ అధికారుల నేతృత్వంలో ఈ మహిళా అధికారులు పని చేయనున్నారు.