చిత్తుగా తాగి భార్య ఎదుటే కూతురిపై అసభ్యంగా ఆటో డ్రైవర్
హైదరాబాద్: తప్పతాగిన మైకంలో తన తండ్రి తన పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నాడని ఆరోపిస్తూ ఏడో తరగతి చదువుతున్న ఓ బాలిక బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ సంఘటన హైదరాబాదులోని బోడుప్పల్లో సోమవారం చోటు చేసుకుంది.
తల్లిదండ్రులు తనతో మద్యం తెప్పించుకుంటారని, తప్పతాగని మైకంలో తన తండ్రి శ్రీనివాస్ తన తల్లి ఎదుటే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తన తల్లి ఏ మాత్రం దానికి అభ్యంతరం చెప్పడం లేదని ఆ బాలిక ఆరోపిస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి తనను వేధిస్తున్నారని ఆ బాలిక అంటోంది.
బాలిక తండ్రి శ్రీనివాస్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్, జ్యోతి రాణి దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాలిక పెద్దది. తల్లిదండ్రుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆ బాలిక ఆరోపిస్తోంది.
పాము కాటుకు మహిళ మృతి
రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మంజుల (20) అనే వివాహిత సోమవారం సాయంత్రం పాము కాటుతో మరణించింది. పొలంలో పనిచేస్తుండగా ఆమె పాము కాటుకు గురైంది. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, ఇంతలోనే ఆమె మరణించింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.