సిబిఐ కేసులకు భయపడే ఎన్ డి ఏకు కెసిఆర్ మద్దతు: కాంగ్రెస్
కెసిఆర్ కు నీతి, నిజాయితీ లేదని మరోసారి తేలిపోయిందని మాజీ ఎంపీ సర్వేసత్యనారాయణ విమర్శించారు. తెలంగాణ వస్తే దళితుణ్ణి సీఎం చేస్తానని చెప్పిన సిఎం కెసిఆర్ మాట తప్పారనన్నారు.
హైదరాబాద్:
కెసిఆర్
కు
నీతి,
నిజాయితీ
లేదని
మరోసారి
తేలిపోయిందని
మాజీ
ఎంపీ
సర్వేసత్యనారాయణ
విమర్శించారు.
తెలంగాణ
వస్తే
దళితుణ్ణి
సీఎం
చేస్తానని
చెప్పిన
సిఎం
కెసిఆర్
మాట
తప్పారనన్నారు.
మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించలేదన్నారు. కెసిఆర్ కు దళితులపై గౌరవం ఉంటే మీరాకుమార్ కు ఓటేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సిబిఐ కేసులకు భయపడే ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్ డి ఏ అభ్యర్థికి మద్దతిస్తున్నారని ఆయన ఆరోపించారు. మీరాకుమార్ ను కెసిఆర్ అవమానించారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మీరా కుమార్ ఫోన్ చేస్తే కెసిఆర్ కనీసం రిప్లై కూడ ఇవ్వలేదన్నారు. తెలంగాణ రావడంలో మీరాకుమార్ పాత్రను మరువలేనిదన్నారు.
ఏ ఒప్పందంతో బిజెపికి మద్దతిస్తున్నారో కెసిఆర్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సిబిఐ కేసులకా...మరేదైనా ఒప్పందం ఉందా అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ బిజెపికి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు.