తీర్పుతో మార్పు: మందుబాబులతో ట్రాఫిక్ పోలీస్ విధులు
హైదరాబాద్: మద్యంమత్తులో వాహనం నడిపిన 35 మందికి తొలిసారిగా సామాజిక సేవా శిక్ష విధించింది ఎర్రమంజిల్ కోర్టు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
ఇక నుంచి నగరంలో మద్యంమత్తులో వాహనం నడిపిన వారు ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించక తప్పదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో మందుబాబులు రహదారిపై ట్రాఫిక్ విధులు నిర్వహించాల్సి వచ్చింది.
నగరంలో చాలా మంది బడాబాబులు, ప్రముఖులు మద్యం సేవించి వాహనం నడపడం, ఒక వేళ పోలీసులకు దొరికితే అపరాధ రుసుము కట్టి తప్పించుకోవడం జరుగుతుండేది. కానీ, ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆ అవకాశం లేకుండా పోయినట్లయింది.
ఎర్రమంజిల్ కోర్టు తీర్పుతో 35మంది మందుబాబులకు ఈ తరహా సామాజిక సేవ శిక్ష పడటంతో మద్యం సేవించి వాహనాలు నడిపే ఇతర మందుబాబులు కొంత జాగ్రత్త పడతారని ఆశిద్దాం.
Comments
English summary
Erramanzil Court on Tuesday punished the 35 persons, who drives the vehicles after drunk.
Story first published: Tuesday, July 28, 2015, 15:46 [IST]