రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ ఉన్నతాధికారులు
రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ ఉన్నతాధికారులు
హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బుధవారం మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి.. సైఫాబాద్ శాఖ, తెలంగాణ రాష్ట్ర పోలీసుతో కలిసి ఏర్పాటు చేసిన డ్రైవ్ సేఫ్ వాహనాన్ని డీజీపీ కార్యాలయంలో... డీజీపీ అనురాగ్ శర్మ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీపీపీ అనురాగ్ శర్మతో పాటు ఐజీ కృష్ణ ప్రసాద్, మాక్స్ క్యూర్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. అనంతరం వారు డ్రైవ్ సేఫ్ వాహనంపై ఏర్పాటు చేసిన భద్రతా ప్రచార పోష్టరుపై డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు పోలీసు అధికారులు సంతకాలు చేసారు. ఈ సందర్భంగా ఐజీ కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.