డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ప్రేమజంటలు: కార్పొరేటర్ ఇంట్లో చోరీ
హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు ప్రేమికుల కోసం ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రేమికులు కూడా పెద్ద సంఖ్యలో రోడ్లపై కనిపించారు.
బంజారాహిల్స్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 5 కార్లు, 3 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో 3 ప్రేమజంటలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అమీర్పేట కార్పొరేటర్ ఇంట్లో చోరీ
హైదరాబాద్లోని అమీర్పేట కార్పొరేటర్ శేషకుమారి ఇంట్లో చోరీ జరిగింది. 4 తులాల బంగారు గొలుసు, రూ.22వేలు నగదు, 2 సెల్ఫోన్లు అపహరణకు గురైనట్లు కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కారులో పెట్టిన ఐదు లక్షలు తస్కరణ
శాంతినగర్, నార్త్ లాలాగూడలో నివాసముండే వంశీనాథ్ కీసర మండల పరిధి దమ్మాయిగూడలో కొంతకాలంగా మార్బుల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల వంశీనాథ్ వద్ద దమ్మాయిగూడలో ఉండే బిల్డర్ బీహెచ్ కుమార్ అనే వ్యక్తి సుమారు ఐదు లక్షల విలువ చేసే మార్బుల్ కొనుగోలు చేశాడు.
శుక్రవారం ఉదయం కుమార్ ఏఎస్రావునగర్లోని సౌత్ ఇండియా బ్యాంక్ నుంచి రూ.ఐదులక్షలు డ్రా చేశాడు. వంశీనాథ్ను బ్యాంకు వద్దకు పిలిపించాడు. అతను కుమార్ వద్ద నుంచి నగదు తీసుకొని తన షిప్టు కారులోని ముందు సీటుపై పెట్డాడు.
ఇదే క్రమంలో వంశీనాథ్ అదే బ్యాంక్లో అకౌంట్ ఉండటంతో కొత్తగా చెక్ బుక్ తీసుకొని అక్కడే మరిచిపోయాడు. మళ్లీ బ్యాంకు లోపలికి వెళ్లివచ్చే సరికి కారులో పెట్టిన డబ్బులు కన్పించలేదు. కంగారుపడిన బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. వారొచ్చి వివరాలడిగి తెలుసుకోవడంతో పాటు బ్యాంక్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.