తెలంగాణ టిడిపి సీనియర్ నేత మస్కతి మృతి: చంద్రబాబు, నేతల నివాళి(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఇబ్రహీం బిన్ అబ్దుల్ మస్కతి(85) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆయన నివాసానికి చేరుకుని, మస్కతీ పార్దివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
వీరితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు సైతం మస్కతికి నివాళులర్పించి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మిధానీ సమీపంలోని స్మశానవాటికలో సోమవారం ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
మజ్లిస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మస్కతీ రెండు పర్యాయాలు ఆ పార్టీ నుంచి యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రెండుసార్లు శాసన మండలి సభ్యులుగా కొనసాగారు.
చంద్రబాబు నివాళి
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఇబ్రహీం బిన్ అబ్దుల్ మస్కతి(85) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆయన నివాసానికి చేరుకుని, మస్కతీ పార్దివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మహమూద్ అలీ ఓదార్పు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్లమెంటుసభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, మజ్లిస్ తెలంగాణ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి, శాసనసభ పక్ష నేత డా. కె లక్ష్మణ్ ఇతర నేతలు ఆయన నివాసానికి చేరుకుని, మస్కతీ పార్దివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
మస్కతి మృతికి నివాలి
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మస్కతి మృతి
వీరితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు సైతం మస్కతికి నివాళులర్పించి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
మస్కతి మృతి
మిధానీ సమీపంలోని స్మశానవాటికలో సోమవారం ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
నివాళి
మజ్లిస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మస్కతీ రెండు పర్యాయాలు ఆ పార్టీ నుంచి యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రెండుసార్లు శాసన మండలి సభ్యులుగా కొనసాగారు.