'రేవంత్ విషయంలో టీడీపీ మేకపోతు గాంభీర్యం', 'టెడ్డీ బేర్లా నారా లోకేశ్'
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్పై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ ట్విట్టర్ బాబే కాదు.. బర్గర్ బాబులా, టెడ్డీబేర్ గా మారారని కమలాకర్ పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో బెయిల్పై విడుదలైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్టాడాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ హెచ్చరించారు. టీడీపీ దొంగల ముఠా జైలుకెళ్తేనే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉంటుందని అన్నారు.
ఆట మొదలు కాకుండానే, టీడీపీ ఆట ముగిసిందని, తెలంగాణతో పాటూ ఏపీలోనూ టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని బాల్క సుమన్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.
షర్మిల పరామర్శ యాత్ర విజయవంతం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయంలో టీడీపీ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ షర్మిల రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన నాలుగు రోజుల పరామర్శయాత్ర విజయవంతమైందన్నారు.
ఈ నెలాఖరులోగా తెలంగాణలోని మరో జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర చేపడతారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు.