హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తోటి ఉద్యోగి, అతని మిత్రుడు మత్తు ఇచ్చి యువతిపై రేప్

తనకు మత్తు మందు ఇచ్చి సహోద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన సహోద్యోగి, అతని స్నేహితుడు తనకు మత్తు మందు ఇచ్చి ఆత్యాచారం చేశారంటూ ఓ యువతి ఆరు నెలల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఘట్కేసర్ పోలీసు స్టేషన్‌లో ఆమె ఈ ఫిర్యాదు చేసింది. మల్కాజిగిరి ప్రశాంత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే యువతి(22) ఓ సంస్థలో పని చేస్తోంది.

ఆ సంస్థలోనే పనిచేస్తున్న ఘట్‌కేసర్‌ గాంధీనగర్‌కు చెందిన సతీష్‌ ఆమెతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. 2016 జూన్‌ 29న యువతిని వరంగల్‌ జాతీయ రహదారి ఘట్‌కేసర్‌ సమీపంలో ఉన్న రెస్టారెంట్‌లోని ఓ గదిలోకి భోజనం కోసం తీసుకెళ్ళినట్లు తెలిపింది. భోజనం చేసిన తరవాత తాను మత్తులోకి వెళ్ళినట్లు ఆమె చెప్పింది.

Girl raped by her colleague in Hyderabad

సతీష్‌తో పాటు అతని స్నేహితుడు జావీద్‌ తనపై పలుమర్లు ఆత్యాచారం చేశారని ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయాన్ని వారు తనకు స్వయంగా చెప్పారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు ఆమె చెప్పింది.

భయంతో ఇంత కాలం తాను పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయినట్లు తెలిపింది. ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

English summary
A girl made complaint against her colleague and his friend in Ghatkeshar PS. She alleged that they raped her after sedating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X