వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్యాలెట్ బయటకు తెచ్చి, ఓటు ఎక్కడ వేయాలని అడిగిన ఎమ్మెల్యే: క్లాస్ పీకిన హరీశ్
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ తెలుగు రాష్ట్రాల్లో ముగిసింది. తెలంగాణలో సీఎం కేసీఆర్తోపాటు దాదాపు సభ్యులందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ తెలుగు రాష్ట్రాల్లో ముగిసింది. తెలంగాణలో సీఎం కేసీఆర్తోపాటు దాదాపు సభ్యులందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, పోలింగ్ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
ఓటు వేయడానికి పోలింగ్ బూత్లోకి వెళ్లిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బ్యాలెట్ పేపరు పట్టుకుని బూత్ బయటికి వచ్చారు. ఓటు ఎక్కడ వేయాలంటూ అడిగారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి హరీశ్ రావు ఆయనను దగ్గరికి పిలిచి క్లాస్ పీకారు.
ఓటు ఎలా వేయాలో ఇంతకుముందే చెప్పినప్పటికీ.. ఇదేంటని హరీశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా వివరణ ఇచ్చేందుకు ముత్తిరెడ్డి ప్రయత్నించగా.. తనకేం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, నేరుగా ముఖ్యమంత్రికే వివరణ ఇవ్వాలని అన్నారు.
Comments
harish rao muthireddy yadagiri reddy president of india హరీశ్ రావు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రాష్ట్రపతి భారత రాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నిక
English summary
Telangana minister Harish Rao on Monday taken a class to MLA Muthireddy Yadagiri Reddy, when president polling continues.
Story first published: Monday, July 17, 2017, 18:03 [IST]